జైపూర్, జూన్ 1: రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఇటీవల వెలుగుచూసిన జియోగ్లిఫ్ ఆకృతులు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. బోహా గ్రామానికి సమీపంలో 20.8 హెక్టార్ల వైశాల్యంలో, 48 కిలోమీటర్ల పొడువుతో ఉన్న ఈ ఆకృతులను ఫ్రెంచ్ పరిశోధకులు గుర్తించారు. 150 ఏండ్ల క్రితం వేసినట్టుగా అంచనావేస్తున్న ఈ ఆకృతులు.. థార్ ఎడారిలో మనుషులు వేసిన అతిపెద్ద డ్రాయింగ్గా అభివర్ణిస్తున్నారు. నేలపై చెక్కే ఆకృతులను ‘జియోగ్లిఫ్స్’గా పిలుస్తారు.