న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ ఆవు జాతులు సంరక్షణ కోసం హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఏఐబీ) శాస్త్రవేత్తలు ‘ఇండీగౌ’ పేరుతో ప్రత్యేక జన్యు చిప్ను తయారు చేశారు. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ దీనిని విడుదల చేశారు. ఇండియాలో జంతువుల జన్యువులపై రూపొందించిన మొదటి చిప్ ఇదేనని చెప్పారు. దేశీ ఆవు జాతులు గిర్, ఒంగోల్, కంక్రేజ్, సాహివాల్ సంరక్షణార్థం ఈ చిప్కు రూపకల్పన చేశారు.