న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలపై భారీ సైబర్ దాడి జరిగింది. ఆయా సంస్థలకు చెందిన 45 లక్షల మంది యూజర్ల డేటా లీకైంది. తమ ఎస్ఐటీఏ పీఎస్ఎస్ సర్వర్ సైబర్ దాడికి గురైందని శుక్రవారం ఎయిరిండియా శుక్రవారం తెలిపింది.
ఎస్ఐటీఏ పీఎస్ఎస్ సర్వర్లో విమాన ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం ఉంటుంది. 2011 ఆగస్టు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్య విమాన ప్రయాణానికి పేర్లు రిజిస్టర్ చేసుకున్న డేటా లీకైంది.
స్టార్ అలయెన్స్తోపాటు ఎయిరిండియా ప్రయాణికుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ వివరాలు, టిక్కెట్ సమాచారం లీక్ అయి ఉండొచ్చునని తెలుస్తున్నది. ఇంకా మలేషియా ఎయిర్లైన్స్, ఫిన్నాయర్, సింగపూర్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, కథాయ్ పసిఫిక్ సంస్థల డేటా కూడా లీకైంది.
అయితే, తమ కస్టమర్ల సీవీవీ/సీవీసీ నంబర్లు.. సంబంధిత డేటా ప్రాసెసర్లో లేవని ఎయిరిండియా వెల్లడించింది. కనుక ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న డేటా లీక్ గురించి తొలుత సమాచారం అందుకున్నామని పేర్కొంది. ఏయే సమాచారం లీకైందన్న విషయమై మార్చి 25-ఏప్రిల్ 5 మధ్య గుర్తించామన్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!