న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా సేకరించడమే గాక నిల్వ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఫౌండేషన్ది తప్పేనని ఔషధాల నియంత్రణ అధికారి ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆయనపై సత్వర చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి విన్నవించారు. దేశ రాజధానిలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గంభీర్ ఫౌండేషన్ మాత్రం డ్రగ్ డీలర్ నుంచి ఫాబిఫ్లూను సేకరించి, వాటిని రోగులకు సరఫరా చేయించారు. కాగా, గంభీర్ ఫౌండేషన్తో పాటు ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్, డ్రగ్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ జూలై 29న జరగనుంది.