‘రంగస్థలం’ చిత్రంలో రామ్చరణ్తో ఐటెంసాంగ్లో ఆడిపాడి యువతను హుషారెత్తించింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ రామ్చరణ్ సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్చరణ్, పూజాహెగ్డే పాత్రలు కథాగమనంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జంటపై త్వరలో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. హైదరాబాద్లో భారీ వ్యయంతో వేసిన ధర్మస్థలి సెట్లో రామ్చరణ్-పూజాహెగ్డే జోడీపై బుధవారం నుంచి ఓ గీతాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్తో ఈ జంట తాలూకు ముఖ్యఘట్టాల చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది.