ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని అధికార తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన సిక్కు ఎంపీ గుర్దీప్సింగ్ సెనెటర్గా శుక్రవారం ప్రమాణం చేశారు. పాకిస్థాన్ పార్లమెంటులోని ఎగువసభకు ఒక సిక్కు ఎంపీ ఎన్నికవటం ఇదే తొలిసారి. గుర్దీప్తో పాటు మరో 47 మంది సెనెటర్లు కూడా ప్రమాణం చేశారు. వచ్చే ఆరేండ్ల పాటు వీళ్లు కొనసాగనున్నారు.