న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు. గత నెల 22న కరోనా బారిన పడిన ఆయన ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరాడు. అప్పటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కరోనా నుంచి బయటపడంతో వైద్యులు ఆయనను దవాఖాన నుంచి డిశ్చార్జీ చేశారు. దీంతో పోలీసులు మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కాగా, ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఛోటా రాజన్ మృతిపై ఊహాగానాలు చెలరేగాయి. ఈనెల ప్రారంభంలో గ్యాంగ్స్టర్ చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అతడు బతికే ఉన్నాడని జైలు అధికారులు ప్రకటించారు. చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండిచారు.
ఈ 61 ఏండ్ల అండర్వరల్డ్ డాన్పై 70 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కిడ్నాప్, మర్డర్ కేసులే ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాలుగా భారతో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కకుండా ఛోటా రాజన్ను 2015లో ఇంటర్ పోల్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఇండోనేషియాలోని బాలీలో అరెస్ట్ చేశారు. అతనిపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు. కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి