మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నం
రాళ్లు విసిరిన కార్యకర్తలు.. g అడ్డుకున్న పోలీసులు
మహబూబాబాద్, మార్చి 15: మానుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చి దాడికి యత్నించా రు. కొందరు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిని అడ్డు కుని కురవి పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లికుదురులో ఆదివారం బీజేపీ, టీఆర్ఎస్ శ్రే ణుల మధ్య ఘర్షణ వాతావర ణం నెలకొనగా, పోలీసులు ఇరు వర్గా ల వారిని చెదరగొట్టిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మానుకోటకు వస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పహా రా కాస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులను అదుపులోకి తీసు కుని బయ్యారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా మానుకోట శివారు ప్రాంతాలైన శనిగపురం, తాళ్లపూసపల్లి, ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, అనంతారం, కురవి, రజాల్ పేటలో వాహన తనిఖీలు చేపట్టి నిఘా పెంచారు. ఈ నేప థ్యంలో సోమవారం బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షు డు వద్దిరాజు రాంచందర్రావు నేతృత్వంలో 15 మంది భార త్ మాతాకు జై.. ఎమ్మెల్యే శంకర్నాయక్ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా క్యాంపు కార్యాలయం వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని ఆపేందుకు య త్నించారు. అయినప్పటికీ కొంతమంది కార్యాలయం పైకి రాళ్లు విసిరారు. వెంటనే టౌన్ సీఐ వెంకటరత్నం, రూరల్ సీఐ సుంకరి రవికుమార్ బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని డీసీఎంలో కురవి పోలీస్స్టేషన్కు తరలించారు.