బెంగళూరు: ప్రతిష్ఠాత్మక ‘గగన్యాన్’ మిషన్లో భాగంగా తలపెట్టిన తొలి మానవరహిత అంతరిక్ష యాత్రను ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించడం సాధ్యం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. కొవిడ్ లాక్డౌన్ల వల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పరికరాల రాకకు అంతరాయం ఏర్పడిందని, ఈ యాత్రను వచ్చే ఏడాది చేపడతామని వెల్లడించింది.