పూజ సామగ్రిని కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే

లక్నో: శంకుస్థాపన కార్యక్రమానికి తనని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం చెందిన బీజేపీ ఎమ్మెల్యే అక్కడకు వెళ్లి హంగామా చేశారు. అంతటితో ఆగక పూజ సామగ్రిని కాలితో తన్నారు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బలూవా గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద గేటు పునరుద్ధరణ పనుల కోసం శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్లాపూర్ ఎమ్మెల్యే రమేష్ చంద్ర మిశ్రా ఈ విషయం తెలుసుకుని తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. తనను ఆహ్వానించకపోవడం, శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధి పేరు శిలాఫలకంలో ఉంచాలని తెలియదా అంటూ మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అంతటితో ఆగక శంకుస్థాపన కోసం ఉంచిన పూజ సామగ్రిని కాలితో తన్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.The honorable BJP MLA from Badlapur, Jaunpur (UP) Ramesh Mishra Ji learned that he wasn't invited to a foundation laying ceremony of a Gate in his area. His name was also missing from the stone to be put up.
— S Rajasekar (@srspdkt) December 27, 2020
What did he do next? Watch pic.twitter.com/kAGzifw8WV
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి