చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు లేదా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే పంజాబ్లోకి ప్రవేశానికి అనుమతిస్తామని తెలిపింది. పొరుగు రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే ప్రజలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పింది. సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ మేరకు శనివారం ప్రకటించారు. అలాగే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నా లేదా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఉపాధ్యాయులు మాత్రమే స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష టీచింగ్కు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ క్లాసులను ఎంచుకునే అవకాశం కూడా విద్యార్థులకు ఉందన్నారు.
కాగా, పంజాబ్లో ఇటీవల స్కూళ్లు, కాలేజీలను తెరిచారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలను వేగవంతం చేశారు. స్కూళ్లలో ప్రతి రోజూ పది వేల ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.