న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు.. ఎప్పుడేమి జరుగుతుందోనని అగ్గల్లాడుతున్నారు. దాదాపు ఏడాది కాలానికే దేశీయ ఫార్మా సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్తోపాటు ఇంటర్నేషనల్ సంస్థలు ఫైజర్, మొడెర్నా తదతర సంస్థలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి జనానికి అందుబాటులోకి తెచ్చాయ.. అంత వరకు బాగానే ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఇటీవలి వరకు కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే వ్యాక్సిన్ సరఫరా చేసింది.. ఇప్పుడు విశ్వమారి తీవ్రత ఎక్కువవుతుండటంతో రాష్ట్రాలకు సరఫరా చేస్తే రూ.400, ప్రైవేట్ దవాఖానలకు రూ.600లకు కొవిషీల్డ్ విక్రయిస్తామని తేల్చేసింది సీరం.
కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ధరతో పోలిస్తే సీరం కొవిషీల్డ్ వ్యాక్సిన్ రాష్ట్రాలకు రెట్టింపుకు పైగా రూ.400, ప్రైవేట్ దవాఖానలకు కొనుగోలు చేస్తే దాదాపు నాలుగు రెట్లు అధికంగా రూ.600లకు విక్రయిస్తామని ప్రకటించింది.
ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల వద్ద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ లభిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉచితంగానే సరఫరా చేస్తున్నది. ప్రైవేట్ దవాఖానలు మాత్రం రూ.250 చార్జి చేస్తున్నాయి. ఎందుకంటే ఆయా దవాఖానలకు కేంద్రం రూ.150లకు వ్యాక్సిన్ విక్రయిస్తున్నది.
ఇప్పుడు 50% వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో ప్రజలకు విక్రయించనున్నది సీరం ఇన్స్టిట్యూట్. మే ఒకటో తేదీ నుంచి 18 ఏండ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశాలిచ్చింది. సీరం ఇప్పుడు తయారు చేస్తున్నకొవిషీల్డ్ వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి, 50 శాతం రాష్ట్రాలు, ప్రైవేట్ దవాఖానలకు విక్రయించాల్సి ఉంటుంది.
ఆస్ట్రా జెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివ్రుద్ధి చేసిందే కొవిషీల్డ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించే ముడి సరుకు ఖర్చు, టీకాపై రాయల్టీ రీయింబర్స్ మెంట్ ప్రస్తుతం సీరం సంస్థ ముందు ఉన్న సవాళ్లలో ఒకటి.
మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతామని సీరం ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే ముడి సరుకు, వ్యాక్సిన్ రాయల్టీ భారం తగ్గించుకోవడానికి టీకాల ధరలు పెంచేసింది. కానీ ఇక్కడే ప్రశ్నలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రానికి రూ.150లకే వ్యాక్సిన్ విక్రయిస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్.. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు, ప్రైవేట్ దవాఖానలకు రూ.600లకు ఎందుకు విక్రయిస్తున్నది. ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం మనది. కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక జనాభా వ్యాక్సినేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నది.
ప్రజలంతా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరుకుంటున్నప్పుడు.. కేంద్రానికి సరఫరా చేసిన ధరకే సీరం తన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రాష్ట్రాలు, ప్రైవేట్ దవాఖానలకు ఇవ్వాలి కదా.. కానీ ప్రైవేట్ దవాఖానలకు రూ.600లకు వ్యాక్సిన్ విక్రయిస్తున్నది.
రూ.600తోపాటు ఇతర చార్జీలు కలిపితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక వ్యాక్సిన్కు రూ.700 వరకు చార్జీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కేంద్రం సరఫరా చేస్తున్న రూ.150కే ఇకముందు సరఫరా చేస్తే ప్రజలకు రూ.250కి వ్యాక్సిన్ చేయగలవు ప్రైవేట్ హాస్పిటల్స్.
ఇప్పటికైతే ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయి గానీ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. వ్యాక్సినేషన్కు చార్జీ చేస్తారా? లేదా? అన్న సంగతి తేల్చలేదు. 100 శాతం జనాభా వ్యాక్సినేషన్ కావాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఈ ధరలతో సాధించడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సినేషన్పై ఇప్పటికీ మౌనంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు మే ఒకటో తేదీ నుంచి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామని ప్రకటించాయి. ప్రజల ప్రయోజనార్థం ఈ ప్రభుత్వాల నిర్ణయాన్ని స్వాగతిద్దాం.. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాటలోనే పయనిస్తూ ప్రజలకు రిలీఫ్ కలిగించాలని ఆశిద్దాం..
జీవితం-మరణం ప్లస్ వ్యాక్సిన్ మధ్య యావద్దేశం కొట్టుమిట్టాడుతున్నది. దేశ ప్రజల ప్రాణాలు కాపాడటం కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యం కావాలి. కేంద్రం జోక్యం చేసుకుని 50 శాతం వ్యాక్సిన్లను రూ.150కి కొనుగోలు చేసినట్లే మిగతా 50 శాతం కొనుగోలు చేయాలని విశ్లేషకులు అంటున్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం. ప్రతి పౌరుడికి వ్యాక్సినేషన్ జరుగాలి. ఇది కేంద్రం తొలి విధి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది