న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు శని, ఆదివారాలు విరామం ఇచ్చాయి. మళ్లీ నిన్నటి నుంచి సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. సోమవారం పెట్రోల్, డీజిల్పై 26 పైసలు, 33 పైసల చొప్పున బాదాయి. తాజాగా మళ్లీ 27 పైసలు, 20 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.91.80కు, డీజిల్ ధర రూ.82.36కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ ధర రూ.98.12, డీజిల్ రూ.89.48, చెన్నైలో పెట్రోల్ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్కతాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20కు పెరిగాయి.
రోజువారీ సమీక్షలో భాగంగా ప్రతిరోజు 6 గంటలకు దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి