కోల్కతా : యాస్ తుఫాను నేపథ్యంలో కోల్కతా ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినందున ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోల్కతా విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు. విమాన సర్వీసులను రద్దు చేసినందున టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ చేస్తామని ఇండిగో ట్వీట్ చేసింది. తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అతి తీవ్ర తుఫానుగా మారిందని, ఈ రోజు మధ్యాహ్నం వరకు బాలాసోర్ ధమ్రా నౌకాశ్రయానికి ఉత్తరాన తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.