న్యూఢిల్లీ, జూలై 24: సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధమైంది. అయితే అందుకు ఓ షరతు విధించింది. యూపీలో ముస్లిం అభ్యర్థిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఎస్పీతో పొత్తుకు సిద్ధమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాజ్భర్ నేతృత్వంలోని భాగీదరి సంకల్ప్ మోర్చాతో ఎంఐఎం ఇప్పటికే పొత్తు పెట్టుకున్నది. ఆ కూటమిలో పలు చిన్న పార్టీలు ఉన్నాయి. చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ సంసిద్ధత ప్రాధాన్యత సంతరించుకున్నది.