న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 18 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ కేసులు ఉధ్రుతంగా సాగుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని వెల్లడించారు.