లక్నో : కరోనా నుంచి కోలుకున్న రోగులు పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే వారికి దవాఖానల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు సైతం కరోనా అనంతర లక్షణాలతో బాధపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఇలాంటి వారికి ఆస్పత్రి వార్డుల్లో ఉచిత చికిత్స అందించాలని యూపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ కేంద్రాల్లో సీఎం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితిని అధికారులతో చర్చిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.