మండుటెండలకు మనషులే కకావికలం అవుతుంటే.. మూగజీవాల పరిస్థితి ఏంటి? సరీసృపాలు సైతం భానుడి భగభగను తట్టుకోలేకపోతున్నాయి. మండుటెండలను భరించలేక పలు జీవాలు దాహార్తిని ఎదుర్కొంటున్నాయి. అలా ఓ పాముకు దాహామేసి జనవాసాల మధ్యలోకి వచ్చింది. ఆ పాము దాహార్తిని ఓ వ్యక్తి తీర్చాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కడలూరు అటవీ ప్రాంతం నుంచి ఓ పాము సమీప గ్రామంలోకి వచ్చింది. అది తీవ్ర దప్పికతో బాధపడుతున్నట్లు ఓ వ్యక్తి గమనించాడు. దీంతో బాటిల్ సాయంతో ఆ పాముకు నీళ్లు తాపాడు. భూమ్మీద్ద నీళ్లు పోసిన తర్వాత పాము తన దాహార్తిని తీర్చుకుంది. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టాడు అతను.
పాముకు దాహార్తి తీర్చిన వ్యక్తిని వన్యప్రాణి ప్రేమికుడైన సెల్వాగా గుర్తించారు. సెల్వాపై స్థానికులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.