ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ
నేటి నుంచి అమలు
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 11: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాస్కులు పెట్టుకోని వారిపై సెక్షన్ 51 నుంచి 60 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 205, సెక్షన్ 188 ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులవుతారని పేర్కొంది. మరోవైపు పోలీసులు మాస్క్ మస్ట్ అని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా 20 మందిపై ఇ-పెట్టీ కేసులు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు పర్చాలని ఎస్పీ సిం ధూశర్మ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తమ ఠాణాల పరిధిలోని కూడళ్లు, బస్, ఆటో స్టాండ్లు, జన సామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. ఠాణాల పరిధిలో జాగ్రత్తలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
దిగొచ్చిన కెయిర్న్: 500 మిలియన్ల డాలర్ల చెల్లింపుకు రెడీ!
వైల్డ్ డాగ్ 150.. వకీల్ సాబ్ 110.. ఇదెక్కడి న్యాయం