ముంబై: మహారాష్ట్రలోని బోయ్సార్లో పెను ప్రమాదం తప్పింది. బోయ్సార్లోని జఖారియా ఫ్యాబ్రిక్ లిమిటెడ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో కంపెనీలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లతో కంపెనీ చుట్టుపక్కల నల్లని పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అంచుకున్న అగ్నిమాపక సిబ్బంధి గటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.