వరంగల్ రూరల్ : పోలీసులమని బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఈ సంఘటన రాయపర్తి మండలంలోని జయరాంతండ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోలీసులమని చెప్పి శివశంకర్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 7 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. శివశంకర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని నగల వ్యాపారి రవీంద్రచారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు.
కాగా, వరంగల్ నుంచి శివశంకర్ బంగారంతో తొర్రూరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన జరిగింది. రాయపర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని బంగారంతో పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?