న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై అవమానకరమైన వ్యాఖ్యలతో కూడా పోస్టర్లు అతికించినందుకు ఢిల్లీ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని వివిధ జిల్లాల్లో పలువురిపై 10 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు ఈస్ట్ ఢిల్లీ కళ్యాణ్పూర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారు ఆప్ కౌన్సిలర్ ధీరెందర్ కుమార్ మనుషులుగా గుర్తించినట్లు చెప్పారు. అందుకే ఈ ఘటనలో ధీరెందర్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని గురించి అవమానకరమైన వ్యాఖ్యలతో పోస్టర్లు వెలిసినట్లు తమకు సమాచారం వచ్చిందని ఒక సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. దాంతో నగరమంతా పోలీసులను అప్రమత్తం చేయడంతో పలువురిపై మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. కళ్యాణ్పురిలో దలీప్ లాల్ (35), శివం దూబే (27), రాహుల్ త్యాగి (24), రాజీవ్ కుమార్ (19) అనే నలుగురిని తమ పెట్రోలింగ్ సిబ్బంది పట్టుకున్నారని అదనపు డీసీపీ సంజయ్ సెహ్రావత్ తెలిపారు.