మైసూర్ : సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కావేది నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా టీ నరసిపురలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గల్లంతైన నలుగురి వయస్సు 13 -15 ఏండ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. నదిలో స్నానం చేసేందుకు దిగిన బాలురు ఒకరి తరువాత ఒకరు గల్లంతైనట్లు పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని, ఇప్పటికే ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.
మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి