న్యూఢిల్లీ: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు ఎంపీలు.. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో, హూగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, కూచ్బీహార్ ఎంపీ నితీశ్ ప్రమాణిక్తో పాటు రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ బరిలో ఉన్నారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ కేరళలోని పాలక్కడ్ నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో ఖుష్బూకు థౌజెండ్ లైట్స్ సీటును కేటాయించారు. బీజేపీ మహిళా సెల్ చీఫ్ వనతి శ్రీనివాసస్.. కమల్హాసన్కు పోటీగా కోయంబత్తూర్ నుంచి పోటీ చేయనున్నారు. అసోంలో 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో 126 స్థానాలకు గాను 92 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టనుంది.