ముంబై: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో ఉన్న వాహనాన్ని నిలిపిన ఘటనలో సస్పెషన్కు గురైన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ఇంటి నుంచి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సచిన్ వాజే .. ఎన్ఐఏ ఆధీనంలోనే ఉన్నాడు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం నిందితుడు వాజేను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. సచిన్ వాజే ఇంట్లో 62 బుల్లెట్లు లభ్యం అయ్యాయని, వాటికి అధికారిక లెక్క లేదని, సర్వీస్ రివాల్వర్ కోసం ఇచ్చిన 30 బుల్లెట్లలో అతని వద్ద కేవలం 5 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించామని, అయితే మిగితా బుల్లెట్లు ఎక్కడ ఉన్నాయో నిందితుడు చెప్పడం లేదని ఎన్ఐఏ తన పిటిషన్లో పేర్కొన్నది.