హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. బుధవారం ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ బట్టాచార్యను ఇంటికి తీసుకెళ్లామని, ఆయనను వారంపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘‘బుద్ధదేవ్ బట్టాచార్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బాగానే మాట్లాడుతున్నారు. ఆక్సిజన్ సంతృప్తత 96 శాతంగా ఉంది. రక్తపోటు సైతం స్థిరంగా ఉంది” అని దవాఖాన ప్రకటనవిడుదల చేసింది. మాజీ సీఎం బుద్ధదేవ్ బట్టాచార్య మే 18న కొవిడ్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో మే 25న ఆయనను కుటుంబీకులు కోల్కతాలోని ఉడ్ల్యాండ్ దవాఖానలో చేర్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.