లక్నో : యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ (89) ఆరోగ్యం నిలకడగా లేదని, డాక్టర్లు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) ఓ ప్రకటనలో పేర్కొంది. దవాఖానలో వైద్య నిపుణులు కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపింది.
బ్రీతింగ్ సమస్యలు ఎదురవడంతో ఆయన నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్పై ఉన్నారని హెల్త్ బులెటిన్ వెల్లడించింది. సింగ్ ఆరోగ్య పరిస్థితిని ఎస్జీపీజీఐఎంఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధిమన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.గతంలో రాజస్ధాన్ గవర్నర్గానూ వ్యవహరించిన కళ్యాణ్ సింగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ జులై 4న ఆస్పత్రి ఐసీయూలో చేరారు. అంతకుముందు ఆయన లక్నోలోని డాక్టర్ రామ్మనోహర్ లోయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోనూ చికిత్స పొందారు.