కోల్కతా: కరోనా మహమ్మారి దేశమంతటా కరాళ నృత్యం చేస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రభావం కొనసాగుతున్నది. పశ్చిమబెంగాల్లో కరోనా విలయతాండవం చేస్తున్నది. సామాన్యులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అక్కడ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గౌరీశంకర్ దత్తా (70) కూడా కరోనా సోకి మృతిచెందారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరీశంకర్ దత్తా నదియా జిల్లాలోని తెహట్టా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఈసారి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించడంతో ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. కాగా, 10 రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!