న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పదవీకాలం ముగిసిన తర్వాత.. ఎన్హెచ్ఆర్సీ చీఫ్ పోస్టు గత ఏడాది డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్నది. ఇవాళ జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఓ ప్యానెల్ సభ్యుడు కూడా చేరారు. జస్టిస్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో చేరారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆయన రిటైర్ అయ్యారు. కోల్కతా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఆయన చీఫ్ జస్టిస్గా చేశారు. జస్టిస్ మిశ్రా తండ్రి హర్గోవింద్ మిశ్రా మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి NHRC చైర్మన్ ఎంపిక జరుగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం NHRC తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి 2020 సెప్టెంబర్ 2న రిటైర్ అయ్యారు.