ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ కార్డియాలజిస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. వారం రోజులుగా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కేకే అగర్వాల్ మృతి పట్ల ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత చమన్లాల్ గుప్తా (87) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకినప్పటికీ దాని నుంచి బయటపడ్డారు