సిమ్లా, జూలై 8: హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ (87) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. చాలారోజులుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇక్కడ ఇందిరాగాంధీ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నది. వీరభద్ర సింగ్ 1983 నుంచి 2007 మధ్యకాలంలో ఆరుసార్లు హిమాచల్ సీఎంగా పనిచేశారు.