ఛండీఘడ్ : మాజీ గవర్నర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ఎల్. భాటియా (100) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో కుటుంబీకులు అమృత్సర్లోని ఫోర్టిస్ హాస్పిటల్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం భాటియా తుదిశ్వాస విడిచారు. అమృత్సర్ పార్లమెంట్ స్థానం నుంచి 1972 నుంచి ఇప్పటివరకు ఆయన ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2008 వరకు ఆ తరువాత 2008 నుంచి 2009 వరకు కేరళ గవర్నర్గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీతో ఆయనకు 101 ఏండ్లు నిండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.