కోల్కతా: గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి సమక్షంలో ఫలేరో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు గోవా నుంచి బెంగాల్కు వచ్చిన ఫలేరో ముందుగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జితో భేటీ అయ్యారు. కాగా, గత 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఫలేరో.. ఈ నెల 27న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది గోవా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ 13 స్థానాలకు పరిమితమైంది. అయినా ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత బలమైన ఓటు బ్యాంకే ఉన్న టీఎంసీ వచ్చే గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఫలేరో టీఎంసీలో చేరడం ఆ పార్టీకి బూస్ట్ను ఇస్తుందనే చెప్పవచ్చు.