అందోల్, మే 3: ప్రభుత్వ దవఖానల్లో కరోనా బాధితులకు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందించేందుకు తగిన సదుపాయాలు ఉన్నాయని, సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేటలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీచేశారు. వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా భారిన పడి ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని, ప్రైవేట్తో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లోనే ఎక్కువ సంఖ్యలో రోగులు కొలుకుంటున్నారని చెప్పారు. చికిత్స పరంగా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగిపేట దవాఖానలో కొవిడ్ బాధితులకు అవసరమైన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర చికిత్సలు అందిచడానికి అవసరమైన సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. తాను కూడా కరోనా బాధితుడినేనని, వారం పాటు విశ్రాంతి తీసుకుంటే వ్యాధి తగ్గిందని చెప్పారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శంకర్బాబు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
వసతులను పరిశీలించిన సంగారెడ్డి ఆర్డీవో
జోగిపేట ప్రభుత్వ దవాఖానలోని వసతులను సోమవారం సంగారెడ్డి ఆర్డీవో మెంచు నగేశ్ పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్కుమార్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం వట్పల్లి మార్కెట్ యార్డులో చైర్మన్ రజినీకాంత్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల పంటకు ఏ గ్రేడ్కు రూ. 1888. బీ గ్రేడ్కు రూ. 1868 చెల్లిస్తుందని మేలురకం ధాన్యం తీసుకువచ్చి మంచి ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో వరం చైర్మన్ వీరారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అశోక్గౌడ్, డైరెక్టర్లు ఘన్నీ, శ్రీనివాస్గౌడ్, నాయకులు బుద్దిరెడ్డి, బస్వరాజ్, శివాజీరావు, సుభాశ్గౌడ్, మహేందర్గౌడ్, యార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.