న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్నీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
సొలి సొరాబ్జీ 1930లో ముంబైలో జన్మించారు. 1953లో బాంబే హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1971లో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా గుర్తించింది. తర్వాత కొంతకాలానికి ఆయన అటార్జీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. మొదటిసారి 1989-90, రెండోసారి 1998-2004 వరకు ఏజీఐగా వ్యవహరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..