తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ జిల్లాలోని ధర్మాడం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా అధికారులకు విజయన్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కేరళలో చాలాకాలంగా వామపక్ష పార్టీలన్నీ కలిపి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)గా ఏర్పడి ఎన్నిలక బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి మెజారిటీ స్థానాలు సాధించడంతో.. ఆ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన సీపీఎం కీలక నేత పినరయి విజయన్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.