హిట్ అండ్ రన్ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టిన ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కేసుల్లో మ్రుతుల కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని ఎనిమిది రెట్లు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంగళవారం నిబంధనలను ఖరారు చేసింది. ఒకవేళ, సంబంధిత వాహనదారు తప్పిదం లేకున్నా.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన వారికి సదరు వాహనం బీమాపై 10 రెట్లు పరిహారం పెంచివేసింది.
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన బాధితులకు తక్షణ రిలీఫ్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు నిర్ణయాలు తీసుకున్నది. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వ్యక్తికి ఇప్పటి వరకు ఇస్తున్న పరిహారం రూ.25 వేలను రూ.2 లక్షలకు పెంచివేసింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.12,500 నుంచి రూ.50వేలకు పెంచింది.
2019 డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హిట్ & రన్ కేసుల్లో 29,354 మంది మరణించగా, 67.751 మందికి గాయాలయ్యాయి. ఈ కేసుల్లో నేరస్తులను పట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనల్లో బాధితులను ఆదుకునేందుకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ఏర్పాటు చేసింది.
రోడ్డు ప్రమాదాలకు కారణమైన వ్యక్తులు, వాహనాలను గుర్తిస్తే.. మరణించిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించింది. సదరు వాహనానికి బీమా సౌకర్యం కల్పించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సంస్థ ఈ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాద మ్రుతులు, గాయపడిన వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు రూపొందించిన ముసాయిదా నిబంధనల మేరకు త్వరలో తుది నిబంధనలు జారీ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
PAN mandatory | ఈ ఆర్థిక లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
వొడాఫోన్ ఐడియాలో నా వాటా ఇచ్చేస్తా: కుమార మంగళం బిర్లా