ఆలేరు రూరల్, మార్చి 25: నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల్లో రోజురోజుకూ పక్కదారి పడుతున్నాయి. దీన్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేస్తున్నది. ఈ మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మా ర్పులు తీసుకువస్తుంది. దీన్ని అధిగమించేందుకు బయో మె ట్రిక్ విధానం, ఐరీస్, ఓటీపీ విధానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. అయినప్పటికీ పీడీఎస్ విధానం పక్కదారి పడుతుం ది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజందరికీ అం దుబాటులో ఉండేలా మేరా రేషన్ యాప్ను తీసుకువచ్చింది.
యాప్ ఉపయోగాలు..
గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మేరా రేషన్ యాప్ను డౌన్లౌడ్ చేసు కోవాలి. దీంట్లో సమీపంలోని రేషన్ దుకాణం అందుబాటులో ఉండే సరుకుల గురించి తెలుసుకోవచ్చు. ఇది ఎంతో ఉపయో గకరం. రేషన్ కార్డు ద్వారా ఇటీవల జరిగిన లావాదేవీలను తెలుసుకోవచ్చు. గడిచిన 6నెలలో ఏ సరుకులు తీసుకున్నారో యాప్లో ఉంటాయి. ఒకవేళ లబ్ధిదారుడు తీసుకోకున్నా తీసు కున్నట్లు చూపితే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు, అధార్ అనుసంధానం అయ్యింది లేనిది తెలుసు కోవచ్చు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో యా ప్ అందుబాటులో ఉంది. త్వరలో తెలుగుతో పాటు 13 భాషల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పక్కదారి పడుతున్న బియ్యం
రూపాయికి కిలో బియ్యం పక్కదారి పడుతుంది. దీంతో పలు చోట్ల జిల్లాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఎం తో మంది అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటూ డబ్బులు గడిస్తున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. కోళ్ల దాణాకు వినియోగిస్తున్నారు. జిల్లా లో 481 రేషన్ షాపులు ఉండగా 2,00,301 ఆహార భద్రత కార్డులు, 13,704 అంత్యోదయ కార్డులు ఉన్నాయి.