ఏటా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
భీమారం, ఏప్రిల్ 24 : ఓరుగల్లు సమగ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని హంగులతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.300కోట్ల నిధులను కేటాయించారని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటో డివిజన్ ముచ్చర్ల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గనిపాక కల్పనా విజయ్ గెలుపు కోసం శనివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గనిపాక కల్పనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలను నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ముచ్చర్ల గ్రామానికి డబుల్ రోడ్డు పనులు నడుస్తున్నాయన్నారు. ప్రచారంలో హసన్పర్తి ఎం పీపీ సునీత, డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, ఎనుమాముల మార్కె ట్ కమిటీ సభ్యుడు గనిపాక విజయ్కుమార్, పెగడపల్లి పీఏసీఎస్ చైర్మన్ చల్లా గోపాల్రెడ్డి, కుడా డైరెక్టర్ నన్నెబోయిన రమేశ్, మట్టెడ పౌల్, చిర్ర వీరస్వామి, పీ శ్రీధర్, చిర్ర రాజేందర్, బండారి సుమన్, సాంబరెడ్డి, శివ, సాయి, నాగరాజు, అనిల్, రమేశ్, మొగిలి, జెట్టి రాజేందర్, సుమతిరెడ్డి, సుకన్య, ఈశ్వరి, తిరుపతి, రాజేశ్ పాల్గొన్నారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం
మడికొండ : గ్రేటర్ వరంగల్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. 46వ డివిజన్ పరిధిలోని మడికొండ ఎస్సీ కాలనీలో శనివారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డంపింగ్ యార్డును ప్రక్షాళన చేసేందుకు రూ.36కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేసినట్లు గుర్తు చేశారు. ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ అభ్యర్థి మునిగాల సరోజన, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.