కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ను ప్రయాణాలకు ముందు సమర్పించాలని పేర్కొంది. సోమవారం నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది.
మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణకు ఈ నిబంధనను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. తాజా మార్గదర్శకాలతో బెంగాల్కు విమానాల్లో ప్రయాణించేందుకు నెగెటివ్ సర్జిఫికెట్ సమర్పించాల్సిన ఇతర రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.