అందోల్, మే17: లాక్డౌన్ సమయంలో పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేట ప్రభుత్వ దవాఖాన ఆవరణలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్వయంగా దవాఖానాకు వచ్చే రోగులు, పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కో-ఆప్షన్ సభ్యుడు ఫైజల్, నాయకులు అనిల్, మారుతి, మహేశ్ పాల్గొన్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్, మే 17: జర్నలిస్టు శ్రీనివాస్ మరణవార్త తనను ఎంతో కలిచివేసిందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేటలో శ్రీనివాస్ సమాధివద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ఎప్పుడు చూసినా చిరునవ్వుతో కనిపించేవారని, ఆయన అకాల మరణం బాధాకారమన్నారు. శ్రీనివాస్ తల్లి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా మీకు అండగా ఉంటానని హామీనిచ్చారు. తక్షణ సహాయంగా రూ.10 వేలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, జర్నలిస్టు సంఘం నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
సంగమేశ్వర్ సేవలు మరువలేనివి
వట్పల్లి, ఏప్రిల్ 17: వట్పల్లి డీసీసీబీ మేనేజర్ సంగమేశ్వర్ అనతికాలంలోనే ప్రజలకు ఎంతో చేరువయ్యారని, ఆయన సేవలు మరువలేనివని, అలాంటి వ్యక్తి అకాల మరణం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం గుండెపోటుతో బ్యాంక్ మేజేజర్ సంగమేశ్వర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం బ్యాంక్లో సిబ్బందితో కలిసి సంగమేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు అశోక్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వినోద్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీశైలం, నాయకులు బుద్దిరెడ్డి, బస్వరాజ్, శివాజీరావు, శ్రీనివాస్గౌడ్, కొసిగే శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.