National
- Jan 02, 2021 , 16:36:25
ఈ నెల 6 నుంచి యూకేకు విమానాలు

న్యూఢిల్లీ: ఇండియా నుంచి యూకేకు ఈ నెల 6 నుంచి విమానాలు తిరిగి ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. అయితే యూకే నుంచి ఇండియాకు వచ్చే విమానాలు మాత్రం ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. వారానికి మొత్తం 30 విమానాలు రాకపోకలు సాగిస్తాయని, ఇందులో ఇండియా, యూకే చెరో 15 విమానాలు నడుపుతాయని తెలిపారు. జనవరి 23 వరకూ ఇదే షెడ్యూల్ ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి మాత్రమే యూకేకు విమాన రాకపోకలు ఉంటాయని కూడా హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
MOST READ
TRENDING