న్యూఢిల్లీ: హిమపాతం విరుచుకుపడటంతో నౌకాదళానికి చెందిన ఐదుగురు పర్వతారోహకులు గల్లంతయ్యారు. ఈ ఘటన శుక్రవారం ఉత్తరాఖండ్లోని మౌంట్ త్రిశూల్ వద్ద చోటుచేసుకుంది. 20 మందితో కూడిన బృందం పర్వతారోహణ కోసం గత నెల 3న ముంబై నుంచి బయలుదేరింది. ఈ బృందంలోని 10 మంది మౌంట్ త్రిశూల్ను అధిరోహించే క్రమంలో ఒక్కసారిగా హిమపాతం విరుచుకుపడింది. దీంతో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సైనికులు, వైమానిక దళ సిబ్బంది గాలిస్తున్నారు.