తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ మెల్లగా వ్యాపిస్తున్నది. గురువారం మరో ఐదుగురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 61కి పెరిగింది. ప్రస్తుతం ఏడు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. జికాతోపాటు కరోనా వైరస్ను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. కేరళలో ప్రస్తుతం డెల్టా వైరస్ వ్యాపిస్తున్నదని, కరోనా పరీక్షలను లక్షల్లో నిర్వహిస్తుండటంతో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. వైరస్ల నియంత్రణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.