కోజికోడ్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4.45 గంటలకు కోజికోడ్-పాలక్కడ్ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న కారు-లారీ ఢీకొన్నాయి. రామనత్తుకార పట్టణ సమీపంలోని పులింజోడ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారు నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. మృతులంతా పాలక్కడ్ జిల్లాకు చెందినవారని చెప్పారు. మృతులను నజీర్, సుబేర్, ముహమ్మద్ జహీర్, అసైనార్, తాహిర్గా గుర్తించినట్లు తెలిపారు.