National
- Nov 29, 2020 , 06:49:07
మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం మావోయిస్టులకోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో కోబ్రా బెటాలియన్లోని ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని ప్రత్యేక హెలీకాప్టర్లో దవాఖానకు తరలించామని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు
- ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి
- ప్రయాణికులకు డబుల్ ఖుషీ
- 28-01-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
- దేశ సంస్కృతిని చాటిచెప్పేలా..
- పీజీ చదివాడు.. అత్యాశకు పోయాడు
MOST READ
TRENDING