కరోనా మహమ్మారి భారతీయ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడి వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూశారు. బుధవారం బాలీవుడ్ సినీ ఎడిటర్ అజయ్శర్మ(30) కరోనాతో న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో మృతిచెందారు. ‘లూడో’, ‘జగ్గాజాసూస్’, ‘కార్వాన్’ చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు అజయ్శర్మ. ప్రస్తుతం తాప్సీ కథానాయికగా నటిస్తోన్న ‘రష్మీ రాకెట్’కు ఆయనే ఎడిటర్గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అజయ్శర్మకు భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్నవయసులోనే అజయ్శర్మ కన్నుమూయడం బాధాకరమని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.