ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాటి బంద్పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో తొలిసారని ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శాంతి భద్రతలను నిర్వహించే బాధ్యత కలిగిన వారు బంద్ కోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు గతంలో ఇలాంటి బంద్లను నిషేధించాయని, శివసేనకు జరిమానా కూడా విధించాయని ఆయన గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ రైతులకు సంఘీభావంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా పిలుపు ఇచ్చిన బంద్ను బాంబే హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు.