విష్ణుమూర్తిని అక్షతలు, పరమేశ్వరుడిని మొగలిపూలు, వినాయకుడిని తులసిదళాలతో అర్చన చేయకూడదని ఆగమశాస్త్రం చెబుతున్నది. తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవికి, గణపతికి మధ్య విరోధం ఏర్పడి ఉభయులూ శాపప్రతిశాపాలు ఇచ్చుకున్నారట.
ఈ కారణం వల్ల గణపతికి తులసి దళం పెట్టకూడదు. అయితే, విఘ్నేశ్వరుడికి గణాధిపత్యం వచ్చిన వినాయకచవితి రోజున మాత్రం సడలింపు ఇచ్చారు. ఆనాడు గణపతిని అర్చించే ఏకవింశతి పత్రాలలో తులసికీ చోటు కల్పించారు.
ఇవి కూడా చదవండి
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు!