భువనేశ్వర్ : ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుండగా ఈ కాల్పులు సంభవించాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసు కమాండర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఏరియాలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఆ రాష్ర్ట డీజీపీ అభయ్ మల్కన్గిరి పర్యటనను రద్దు చేసుకున్నారు.